Breaking News

సాయి ధరమ్ తేజ్‌ బైక్ ఇదే.. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్


మితిమీరిన వేగం ప్రమాదకరం అని చెబుతూనే ఉంటారు. కానీ కొందరు వినరు. అలా వినక ఏటా ఎంతో మంది ప్రాణాలు వదులుతుంటారు. గాయాలపాలవుతుంటారు. హెల్మట్ ధరించాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు. ఫైన్లు కూడా వేస్తుంటారు. కొందరు ఆ నిబంధనను వింటారు. ఇంకొందరు వినరు. కానీ మన హీరో హెల్మట్ ధరించడం వల్లే నేడు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. హెల్మెట్ లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. మితి మీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, వేగాన్ని కంట్రోల్ చేయలేక వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఐకియా, దుర్గం చెరువు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పైగా నిన్న పండుగ కాబట్టి రోడ్డు మీద ఎక్కువ రద్దీ లేదు. అదే సాయి ధరమ్ తేజ్‌కు కలిసి వచ్చింది. ఆ వేగం అలా రోడ్డు మీద స్కిడ్ అయిపోవడం, వెనక నుంచి వాహనాలేవీ రాకపోవడంతో ప్రాణాపాయ స్థితి తప్పింది. బైక్‌కు ఎలాంటి గాట్లు కూడా పడనట్టు కనిపిస్తోంది. ఇక ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సీసీటీవీ పుటేజ్‌ను కూడా పరిశీలించారు. ఇసుక ఉండటంతో జారి పడ్డారని కొందరు అంటున్నారు. వేగాన్ని అదుపుచేయలేకపోవడంతోనే అలా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తరువాత బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు బుక్ చేసుకున్నారు. బైక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సీసీటీవీ పుటేజ్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


By September 11, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-accident-video-and-bike-visuals/articleshow/86109040.cms

No comments