Breaking News

Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు.. తమన్ ఎమోషనల్


మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగిందనే వార్త కేవలం టాలీవుడ్‌నే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురి చేసింది. స్పోర్ట్స్ బైకుపై మితి మీరిన వేగంతో వెళ్లిన సాయి ధరమ్ తేజ్‌కు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అతని వేగం దాదాపు 180 కి.మీ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే ఆయన బైక్‌కు పెద్దగా డ్యామేజ్ కాలేదు. కానీ సాయి ధరమ్ తేజ్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. కన్ను, భుజం, చాతి భాగాలకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌ను అపోలో హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. శుక్ర‌వారం రాత్రి 8.30 నిమిషాల‌కు యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌కు అపోలో వైద్యులు డాక్టర్ అలోక్ రంజాన్ న్యూరోసర్జరీ, డాక్టర్ సుబ్బారెడ్డి క్రిటికల్ కేర్, డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్ పాలమనాలకిస్ట్, డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి ఆర్థోపెడిక్స్ చికిత్స‌ను అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ప్రకటనను విడుదల చేశారు. దాన్ని షేర్ చేస్తూ చిరంజీవి తమ అభిమానులకు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు. అంతగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నారు. కొన్ని రోజుల్లోనే తిరిగి వస్తారు. ఫ్యాన్స్ అందరూ కంగారు పడకండి అని చిరు తెలిపారు. ఇక వరుణ్ తేజ్ సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రికవరీ అవుతున్నారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇక సాయి ధరమ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన స్పందించారు. అంత మంచే జరుగుతోంది.. నా ఫ్రెండ్ గురించి నాకు తెలుసు.. త్వరలోనే తిరిగి వస్తారు.. నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేని వాటిని, జరగని వాటి గురించి ప్రచారం చేయకండి.. ఇలాంటి సమయంలో మంచి ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయండి. నా హీరో సేఫ్ అంటూ తమన్ ఎమోషనల్ అయ్యారు.


By September 11, 2021 at 06:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-varun-tej-and-thaman-on-sai-dharam-tej-accident/articleshow/86108851.cms

No comments