Breaking News

TMC సువేందుకు దీదీ షాక్.. చోరీ కేసులో ఇరికించిన పోలీసులు!


బెంగాల్ ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యే సువేందు అధికారిపై దొంగతనం కేసు నమోదయ్యింది. సువేందు సహా ఆయన సోదరుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు పోలీసులు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి లక్షల రూపాయాల విలువైన సహాయ సామాగ్రిని అపహరించినట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. పూర్బ్ మేదినీపూర్ జిల్లాల్లోని కంతీ మున్సిపల్ కార్యాలయంలోని సామాగ్రిని సువేందు సోదరులు దొంగిలించినట్టు రత్నదీప్ మున్నా అనే సభ్యుడు ఫిర్యాదు చేశారు. ‘‘సువేందు అధికారి, ఆయన సోదరుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ సుమేందు అధికారి సూచనలతో మే 29 మధ్యాహ్నం 12.30న మున్సిపల్ కార్యాలయం గొడౌన్‌‌లోకి బలవంతంగా, అక్రమంగా ప్రవేశించి లక్షలాది రూపాయల విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు’’ అని జూన్ 1న కంతీ పోలీస్ స్టేషన్‌కు చేసిన ఫిర్యాదులో రత్నదీప్ మున్నా ఆరోపించారు. సహాయక సామాగ్రిని తృణమూల్ కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని తరుచూ బీజేపీ ఆరోపిస్తుండగా.. తాజాగా, , ఆయన సోదరుడిపై ఈ విధమైన ఆరోపణలతోనే కేసు నమోదుచేయడం గమనార్హం. తనకు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్న కేంద్ర బలగాలను ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సువేందు అధికారి ఇంత వరకూ స్పందించలేదు. సువేందు ప్రధాన అనుచరుడ్ని చీటింగ్ కేసులో కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసిన మర్నాడే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నీటిపారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి సువేందు అనుచరుడు రఖాల్ బేరా 2019లో రూ.2 లక్షలు తీసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. గతేడాది నవంబరు వరకూ మమతా క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న సువేందు అధికారి.. డిసెంబరులో నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై 1,200 ఓట్లతో సువేందు విజయం సాధించారు.


By June 06, 2021 at 01:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leader-suvendu-adhikari-brother-accused-of-stealing-relief-material-case-filed/articleshow/83279148.cms

No comments