Mandya: పెళ్లైన 11 నెలలకే గుండెపోటుతో భర్త మృతి... యువతి షాకింగ్ నిర్ణయం
కష్టసుఖాల్లో జీవితాంత తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. దీంతో తట్టుకోలేకపోయిన భార్య అతడి అంత్యక్రియలు పూర్తికాగానే తాను కూడా ఆత్మహత్య చేసుకుని తవును చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన కిరణ్ (30), పూజా (22)లకు 11 నెలల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరు బొమ్మనహళ్లిలోనే కాపురం ఉంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటను చూసి బంధువులు, స్థానికులు మచ్చటపడేవారు. అయితే శుక్రవారం ఉదయం కిరణ్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కిరణ్ శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఏడాది తిరగకముందే భర్త తనను వదిలి వెళ్లిపోవడాన్ని పూజా తట్టుకోలేకపోయింది. అతడే లోకంగా బ్రతికిన తనకు ఇక దిక్కెవరని కన్నీరుమున్నీరైంది. అతడు లేని లోకంలో తాను కూడా ఉండలేనని నిర్ణయించుకుంది. బంధువులు అంత్యక్రియలు నిర్వహించి వచ్చేసరికి పూజా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చూసి అందరూ షాకయ్యారు. కొంతసేపటికి ఆమె మృతదేహానికి కూడా అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిపించారు.
By May 24, 2021 at 06:20AM
No comments