Breaking News

Joe Biden.. ఇజ్రాయేల్-పాలస్తీనా వివాదానికి అదొక్కటే పరిష్కారం


అగ్రరాజ్యం అమెరికా జోక్యం, ఈజిప్టు దౌత్యంతో 11 రోజులపాటు సాగిన ఇజ్రాయేల్, పాలస్తీనా ఘర్షణలకు తెరపడిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్-పాలస్తీనా సమస్యకు ‘టూ స్టేట్స్ విధానమే’ సరైన సమాధానమని అన్నారు. గాజా పునర్నిర్మాణం కోసం సహకారం అందజేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. పాలస్తీనాను రెండుగా విభజించడమే సరైందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జెరూసలెం నగరంలో అంతర్గత మతఘర్షణలకు స్వస్తి పలకాలని ఇజ్రాయేల్‌కు సూచించినట్టు పేర్కొన్నారు. ‘‘అయినప్పటికీ ఇజ్రాయేల్ భద్రతకు కట్టుబడి ఉంటామని, మా నిబద్ధతలో ఎటువంటి మార్పు లేదు.. ఈ ప్రాంతం ఇజ్రాయెల్ ఉనికిని నిస్సందేహంగా అంగీకరించే వరకు శాంతి ఉండదు’’ అని ఆయన అన్నారు. దశబ్దాలుగా అంతర్జాతీయ దౌత్యానికి సవాల్‌గా నిలుస్తున్న ఇజ్రాయేల్-పాలస్తీనా సంఘర్షణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంలో భాగంగా జెరూసలేంను ఉమ్మడి రాజధానిగా స్వత్రంత పాలస్తీనా, ఇజ్రాయేల్ దేశాలుగా ఏర్పాటుచేయడం. ఈ సమస్యకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన విధానం విమర్శలకు గురయ్యింది. ఇది ఇజ్రాయేల్‌కు ఏకపక్షంగా ఉందని, పాలస్తీనియన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. రెండు దేశాల ఏర్పాటు పరిష్కార విధానానికి ట్రంప్ అల్లుడు, ఆయన సలహాదారు జరేడ్ కుష్నర్ ఆధ్వర్యంలో రూపకల్పన జరిగింది. అయితే, ఇందులో పాలస్తీనాకు పరిమిత సార్వభౌమాధికారం కల్పించారు. భద్రత మొత్తం ఇజ్రాయేల్‌కు అప్పగిస్తూ ప్రణాళికను రూపొందించారు. అయితే, ఈ ప్రణాళికను పాలస్తీనా నేతలు తోసిపుచ్చారు. తాజాగా, బైడెన్ మరోసారి రెండు దేశాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇజ్రాయేల్ భద్రత విషయంలో తమ వైఖరి మారదన్న అమెరికా అధ్యక్షుడు.. రెండు దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమన్నారు. ఇదొక్కటే సమాధానం అని ఆయన నొక్కి వక్కాణించారు. పరస్పర గుర్తింపు, సరిహద్దులు, భద్రత, నీటి హక్కులు, జెరూసలేం నియంత్రణ, ఇజ్రాయేల్ స్థావరాలు, పాలస్తీనా ఉద్యమ స్వేచ్ఛ తదితర అంశాల ప్రాతిపదికగా రెండు దేశాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.


By May 22, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-state-solution-is-only-answer-us-president-biden-amid-israel-palestine-tension/articleshow/82850886.cms

No comments