Breaking News

టాలీవుడ్ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూత


దేశంలో వీరవిహారం చేస్తున్న మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. ఇటీవలే నటుడు, సినీ జర్నలిస్ట్ TNR మరణించారనే విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే టాలీవుడ్ లోకంలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, రచయిత కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. క‌రోనా సోకడంతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకున్న ఆయనకు నటుడు సప్తగిరి లక్ష రుపాయల ఆర్థిక సాయం చేయగా.. కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందిన‌ట్లు తెలిసింది. అయినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మరణించడం తీవ్ర విషాదం నింపింది. 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో ప్రయాణం మొదలు పెట్టిన నంద్యాల రవి.. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత విజయ్‌ కుమార్‌ కొండా తీసిన 'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమాతో రచయితగా మారారు. ఈ మధ్యే వచ్చిన 'పవర్‌ ప్లే' సినిమాకు ఆయన స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేశారు. నంద్యాల రవి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.


By May 14, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-director-nandyala-ravi-died-with-covid-19/articleshow/82626536.cms

No comments