డేటింగ్ యాప్లో అసభ్యకర ఫొటోలు.. వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి
కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ కొన్ని సందర్భాల్లో లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సైబర్ నేరగాళ్ల చర్యలకు కొందరు సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ మోసాలతో పాటు సామజిక మాధ్యమాల ద్వారా మహిళలపై వేధింపులు జరుగుతుండటం చూస్తున్నాం. తాజాగా సినీ నటి ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నానని తెలుపుతూ ఇవ్వడం హాట్ ఇష్యూగా మారింది. టాలీవుడ్ నటి షకీలా నటించిన ‘శీలవతి’ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన నటి గీతాంజలి (ఫ్రూటీ) తన ఫొటోను డేటింగ్ యాప్లో పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె వాపోయింది. నిత్యం ఫోన్ కాల్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. గీతాంజలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 501 సెక్షన్ కింద నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశం మీద దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసుపై తగిన విచారణ చేపట్టి నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవలే సింగర్ మధుప్రియ కూడా తనకు కొన్ని ఫోన్ నెంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని షి టీంను ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
By May 26, 2021 at 01:12PM
No comments