Breaking News

భారత్‌లో కరోనా విలయం... 3.82 లక్షల కొత్త కేసులు, 3,780 మరణాలు


దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,82,315 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 3,780 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం అధికారికంగా వెల్లడించింది. అలాగే నిన్న కరోనా నుంచి కోలుకుని 3,38,439 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలిసి 2,06,65,148కి చేరుకున్నాయి. అలాగే కోలుకున్న వారి సంఖ్య 1,69,51,731కి చేరింది. దేశంలో ప్రస్తుత యాక్టిస్‌ కేసుల సంఖ్య 34,87,229గా కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 2,26,188కి పెరిగింది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 16,04,94,188 మంది కొవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


By May 05, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/382315-corona-cases-registered-within-24-hours-in-india/articleshow/82400218.cms

No comments