Breaking News

హనీమూన్‌ నుంచి రాగానే భర్తకు కరోనా.. 10రోజులకే చేదువార్త, కుప్పకూలిన భార్య


ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా కొనసాగుతున్న వారి జీవితాల్లోకి కరోనా ప్రవేశించింది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతుల ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లా ఇటామటి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మధురాపూర్‌ గ్రామంలో జరిగింది. ఒకే గ్రామానికి చెందిన సునీత రాణి పాత్ర (27), దిలీప్‌ పాత్ర (30) నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం మార్చిలో అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెళ్లొచ్చారు. పది రోజుల క్రితం భువనేశ్వర్‌కు తిరిగొచ్చిన దంపతులిద్దరూ భువనేశ్వర్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా దిలీప్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా... సునీత అత్తవారింటికి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు సమాచారం రావడంతో షాక్‌కు గురైన సునీత నేలకూలిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దిలీప్ మృతదేహానికి కొవిడ్‌ నిబంధనల మధ్య అంత్యక్రియలు నిర్వహించగా, సునీతకు గ్రామంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


By May 04, 2021 at 01:45PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/newly-amrried-couple-died-in-odisha-due-to-corona/articleshow/82383946.cms

No comments