Breaking News

ప్రజలు చనిపోవాలని కోరుకుంటున్నారా? కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


కరోనా బాధితులకు చికిత్సలో ఉపయోగించే అత్యవసర ఔషధం రెమ్‌డెసివిర్‌కు దేశంలో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సకు వినియోగం విషయంలో కేంద్రం మార్గదర్శకాల‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు ప్రజలు చనిపోవాలని కోరుకుంటున్నట్టు ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ఇది తప్పు. ఇది పూర్తిగా అవివేకం.. ఇప్పుడు ఆక్సిజన్ లేని వ్యక్తులు రెమ్‌డెసివిర్ పొందలేరు.. అటే ప్రజలు చనిపోవాలని కోరుకున్నట్టుంది’’ అని జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అనుసరిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు మాత్రమే రెమ్‌డెసివిర్ వినియోగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడ్‌విట్‌లో పేర్కొంది. రెమ్‌డెసివిర్ నిర్వహణకు ప్రోటోకాల్స్ లేదా మార్గదర్శకాలలో మార్పు అవసరమైతే వైద్య కమిటీ సమీక్షణ తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ‘‘కొరతను అధిగమించడానికి మాత్రమే ప్రోటోకాల్‌ను మార్చవద్దు.. అది తప్పు.. తత్ఫలితంగా, వైద్యులు రెమ్‌డెసివిర్‌ను సూచించలేరు.. ఇది పూర్తిగా దుర్వినియోగం’’ అని కోర్టు తెలిపింది. ఢిల్లీకి 72 వేల వరకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు అవసరం కాగా.. ఏప్రిల్ 27 వరకు 52,000 అందజేసినట్టు కేంద్రం తెలిపింది. రాష్ట్రాల్లోని ఉన్న కేసుల తీవ్రతను బట్టి కేటాయింపులు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఢిల్లీకి కేటాయింపులు అంత తక్కువగా లేవని కోర్టు తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి 10,000 ఇంజెక్షన్లను సేకరించి, చార్టర్డ్ విమానం ద్వారా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు రవాణా చేసి, అక్కడ పంపిణీ చేయగలిగామని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తి పెంచి మరిన్ని కేటాయింపులు చేస్తామని కోర్టుకు తెలియజేసింది. అయితే, కేంద్రం చెబుతున్నట్టు తమకు 52 వేలు ఇవ్వలేదని, కేవలం 2,500 వయల్స్ మాత్రమే ఇచ్చారని ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు.. మిగతా 50వేలు ఇంజెక్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించగా.. ప్రయివేట్ ఛానెల్స్ ద్వారా హాస్పిటల్స్‌కు సరఫరా చేసినట్టు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రైవేటు పంపిణీని దృష్టిలో ఉంచుకుని, ఏ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివీర్ లభిస్తుందో పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, రెమ్‌డెసివిర్ అవసరమయ్యే చాలా మంది ఆస్పత్రుల్లో పడకల కొరతతో చేరకుండా ఇంట్లో చికిత్స పొందుతున్నారని ఈ విధానంతో కోర్టు ఏకీభవించలేదు. జస్టిస్ సింగ్ మాట్లాడుతూ.. రోగి లేదా కుటుంబం లేదా అటెండెంట్ ఔషధం కోసం పోర్టల్‌ ద్వారా కొనుగోలుకు అనుమతించడం మంచిదని, నగదు చెల్లించిన తర్వాత వారు తీసుకోవచ్చని తెలిపింది. రెమ్‌డెసివిర్ అవసరమైన 90 శాతం మంది రోగులకు ఔషధం అందేలా ఇది నిర్ధారిస్తుందని, ఆస్పత్రులు మాత్రమే అందజేస్తే 50 శాతం మందికి మాత్రమే లభిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు సూచనలు అందులో చేర్చే వరకు పోర్టల్ ప్రారంభం నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్-19తో బాధపడుతున్న ఓ లాయర్ దాఖలుచేసి పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది. కోర్టు జోక్యంతో మంగళవారం రాత్రి ఆ లాయర్‌కు రెమ్‌డెసివిర్ డోస్ అందజేసింది.


By April 29, 2021 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-high-court-slams-centres-covid-19-protocol-on-remdesivir/articleshow/82305829.cms

No comments