Breaking News

ప్రభాస్ అలా అనడం జీవితంలో మర్చిపోలేను.. సీక్రెట్ బయటపెట్టిన 'బాహుబలి' యాక్టర్


డార్లింగ్ ప్రభాస్.. స్టార్ వారసుడే అయినా సాధారణ స్థాయిలో వెండితెరపై ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారాయన. టాలీవుడ్ స్టార్ హీరోగా కీర్తించబడుతూనే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యారు. అయితే ప్రభాస్‌తో పని చేసిన ఏ వ్యక్తి అయినా ఆయన గురించి చెప్పేది ఒక్కటే. చాలా సింపుల్ పర్సన్. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగిఉండే అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు డబ్బింగ్ ఆర్టిస్ట్ . ''బాహుబలిలో నేనో చిన్న రోల్ చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లే ముందు మేకను బలిచ్చే సన్నివేశంలో 'యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది పెనుముప్పు తప్పదు యువరాజా' అనేది నా డైలాగ్‌. అయితే ఆ డైలాగ్‌ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరకు వచ్చి డార్లింగ్‌ ఏమనుకోకు.. డైలాగ్‌ కొంచెం మెల్లిగా చెప్పవా.. నా డైలాగ్ మరిచిపోతున్నాను అన్నారు. నా జీవితంలోనే ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మర్చిపోలేను'' అని చెప్పారు ఆదిత్య. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయన లాంటి మంచి మనసున్న హీరోను లైఫ్‌లో ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని ఆదిత్య అన్నారు. సెట్‌లో అందరితో ఆయన ఎంతో సరదాగా మెదులుతుంటారని, తనతో పనిచేసే అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. నిజంగానే ఆయన డార్లింగ్‌ అంటూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కాగా 'సాహో' డిజాస్టర్ తర్వాత సినిమాల వేగం పెంచారు ప్రభాస్. ఇప్పటికే తన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' మేజర్ పార్ట్ ఫినిష్ చేసిన ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'సలార్' చకచకా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టారు ఈ యంగ్ రెబల్ స్టార్.


By April 29, 2021 at 02:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/artist-aditya-shares-funny-incident-with-prabhas/articleshow/82307567.cms

No comments