Breaking News

తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన వెంకటేష్.. నారప్ప రిలీజ్ వాయిదా.. అఫీషియల్ స్టేట్‌మెంట్


ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రతి ఒక్కరిలో ఆందోళన నింపుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతూ వస్తుండటం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు రాకపోవడం ఒక్కటే ఇందుకు నివారణ చర్య అని గడపదాటి ఎక్కడికీ వెళ్లడం లేదు జనం. ఈ పరిస్థితుల్లో థియేటర్స్ గేట్లకు మళ్ళీ తాళాలు పడ్డాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా వేశారు. తాజాగా ఆ లిస్టులో '' కూడా చేరింది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో 'నారప్ప' మూవీ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని మే 14న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఊహించని రీతిలో కరోనా దాడి మళ్ళీ ప్రారంభం కావడంతో 'నారప్ప' విడుదల వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు వెంకటేష్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక అతిత్వరలో చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. 'అందరం మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం సమాజానికి చేసే గొప్ప సాయం' అని ఆయన పేర్కొన్నారు.


By April 29, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/daggubati-venkatesh-narappa-movie-release-post-pone/articleshow/82305534.cms

No comments