Breaking News

హీరోయిన్ సమీరా రెడ్డికి కరోనా పాజిటివ్.. ఆమె పిల్లలకీ కోవిడ్!! సినీ నటి ఎమోషనల్ మెసేజ్


దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిత్యం అన్ని ఏరియాల్లో వేలల్లో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కారోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా లేదంటూ నిపుణులు హెచ్చరిస్తుండటంతో భయానక పరిస్థితి నెలకొంది. దేశంలో సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా కాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు, తన పిల్లలకు కరోనా సోకిందని తెలుపుతూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేసింది హీరోయిన్ . 'నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పటికైతే నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి' అని పేర్కొన్న సమీరా.. తన పిల్లలు కోవిడ్‌ లక్షణాలతో అస్వస్థతకు లోనయ్యారని, నాలుగు రోజుల క్రితం టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని.. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. ఏ ఒక్కరూ కరోనాను నిర్లక్ష్యం చేయకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోస్ట్ పెట్టింది. 2014 సంవత్సరంలో వ్యాపారవేత్త అక్షయ్‌ వార్డేను పెళ్లి చేసుకుంది సమీరా. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన ప్రెగ్నెసీ సంగతులు ఓపెన్‌గా చెప్పేస్తూ పలు పోస్టులు పెట్టి సూపర్ విమెన్ అనిపించుకుంది. పలు బాలీవుడ్ సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాల్లో నటించి మెప్పించింది. సమీరా కుటుంబం కరోనా బారిన పడిందని తెలిసి ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. సమీరా ఫ్యామిలీ అంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


By April 19, 2021 at 01:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sameera-reddy-and-her-kids-tests-covid-19-positive/articleshow/82141845.cms

No comments