Breaking News

భార్య షాలినితో పోలింగ్ కేంద్రానికి అజిత్.. అభిమాని అత్యుత్సాహంతో ఫోన్ లాక్కొని వార్నింగ్! వీడియో వైరల్


ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం నుంచి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో జన సందోహం కనిపిస్తోంది. ఈ క్రమంలో హీరో తన ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు. ఓ అభిమాని కారణంగా కాసింత అసహనానికి గురై వార్తల్లో నిలిచారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దఎత్తున ప్రచారం చేసిన సినీ తారలంతా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెలబ్రిటీల రాకతో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జనం గుమిగూడారు. ఈ నేపథ్యంలో భార్య షాలినీతో కలిసి హీరో అజిత్ తిరువాన్మయూర్‌లోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సాధారణ వ్యక్తి లాగే క్యూ లైన్‌లో నిల్చొని ఓటేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని అత్యుత్సాహంతో సహనం కోల్పోయారు అజిత్. మాస్క్ లేని ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో హీరో అజిత్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే అతని చేతిలోని ఫోన్‌ను లాక్కొని జేబులో పెట్టుకోవడమే గాక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతని ఫోన్ అతనికి ఇచ్చేశారు అజిత్. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమాని అత్యుత్సాహమే అజిత్ కోపానికి కారణమైందని అక్కడ ఈ సీన్ చూసిన వారు అంటున్నమాట.


By April 06, 2021 at 03:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/star-hero-ajith-kumar-takes-phone-from-maskless-fan-at-polling-station/articleshow/81930501.cms

No comments