Breaking News

మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల అతి.. దిమ్మతిరిగింది!!


కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ముఖానికి మాస్క్ లేదంటూ బైకర్‌ని ఆపిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. రెచ్చిపోయి అతన్ని చితకబాది చిక్కుల్లో పడిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఇండోర్ నగరానికి చెందిన యువకుడు(35)ను మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. మాస్క్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై యువకుడిని చితకబాదారు. మహిళలు, పిల్లలు వేడుకుంటున్నా అత్యంత అమానుషంగా కొట్టారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. కనీసం జాలి, దయ లేకుండా దారుణంగా కొట్టిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. యువకుడిని పోలీసులు చితకబాదిన ఘటనను విచారించాల్సిందిగా సీఎస్‌పీ ఆదేశాలిచ్చిన్లు బగ్రి తెలిపారు. మాస్క్ పెట్టుకోకుండా వస్తున్న యువకుడిని ఆపి.. కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదని అడిగినందుకు కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారని.. వివాదం ముదరడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఎడిటింగ్ చేసినవని చెప్పారు. సదరు యువకుడిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. Also Read:


By April 07, 2021 at 05:51PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-mp-cops-thrash-man-for-not-wearing-mask-video-gets-wiral/articleshow/81952168.cms

No comments