Breaking News

అవన్నీ చూసేంత ధైర్యం లేదు.. అందుకే వదిలేస్తున్నా.. చేతులు జోడించి మరీ ఛార్మీ ఆవేదన


టాలీవుడ్ హీరోయిన్, నటి, నిర్మాత ఇలా పలు రకాలుగా తన సత్తాను చాటుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా నటనకు దూరంగా ఉన్నచార్మీ నిర్మాణ పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. అది కూడా నిర్మించే చిత్రాల బాధ్యతలను ఛార్మీ భుజాన వేసుకుంటారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే నిర్వహిస్తుంటారు. అలాంటి ఛార్మీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్, ఛార్మీ అంతా కూడా ముంబైలో ఉన్నారనే సంగతి తెలిసిందే. గతేడాది నుంచి పూరి జగన్నాథ్, ఛార్మీలు ముంబైలోనే ఉంటున్నారు. గత ఏడాది లాక్డౌన్ విధించడంతో లైగర్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి అక్కడే ఉండిపోయారు. మళ్లీ ఇప్పుడు లైగర్ సినిమాను శర వేగంగా పూర్తి చేస్తోన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైంది. దీంతో మరో బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది.అయితే ఇప్పుడు మాత్రం కరోనా మునుపటి కంటే రెట్టింపు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ర్ట అందులోనూ ముంబై పరిస్థితి దారుణంగా ఉంది. ఈ కరోనా విలయ ప్రతాపాన్ని చూసి ఛార్మీ చలించిపోయినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఛార్మీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి మరింత భయంకరంగా మారేట్టు కనిపిస్తోంది.. దురదృష్టవశాత్తు వీటన్నంటిని చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నాను. అందరూ ఇంట్లోనే ఉండండి.. మీరు ప్రేమించే వారిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పుకొచ్చారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నేను మాత్రం ఇప్పుడు వదిలేస్తున్నాను.. మన దేశం ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉంది.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ చేతులు జోడించి మరీ ఛార్మీ వేడుకున్నారు.


By April 20, 2021 at 08:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/charmme-kaur-emotional-comments-on-covid-19-in-india-at-present/articleshow/82155135.cms

No comments