Breaking News

'జాతిరత్నాలు' మూవీ చూసిన మహేష్ బాబు.. హీరో నవీన్‌ పొలిశెట్టిపై సూపర్ స్టార్ కామెంట్స్


ఔట్‌ అండ్‌ ఔట్‌ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన '' మూవీ తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాం అంటూ వచ్చిన మౌత్ టాక్ రెండు రోజుల్లోనే ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ దగ్గరి దాకా తీసుకెళ్లింది. చిత్రంలో హీరో నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ తన ఫీలింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "అప్పట్లో‌ నేనొక్కడినే మూవీ సెట్స్‌లో నవీన్‌ పొలిశెట్టితో మాట్లాడాను. అప్పుడే తెలిసింది అతను నవ్విస్తూ కనిపించినా ఎంతో కష్టపడే మనస్తత్వం కలవాడని. అతనిలో స్పార్క్‌ ఉందని అర్థమైంది. ఇప్పుడు జాతిరత్నాలు మూవీలో సెన్సేషనల్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా చూస్తూ ఫుల్ ఎంజాయ్‌ చేశా. ఎంటైర్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌" అని ట్వీట్ చేశారు మహేష్ బాబు. దీంతో ఈ ప్రశంస సినిమాకు ఇంకాస్త బూస్టింగ్ ఇచ్చింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిరన్తగా ఈ 'జాతిరత్నాలు' చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ అనుదీప్ కె.వి దర్శకత్వం వహించారు. చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలు పోషించగా.. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించింది. కేవలం కామెడీనే టార్గెట్‌గా పెట్టుకొని కడుపుబ్బా నవ్వించారు ఈ జాతిరత్నాలు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్ తెచ్చుకున్న‌ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచనలం సృష్టిస్తోంది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకోగా.. ఇప్పుడు విడుదల తర్వాత మహేష్ బాబు లాంటి ప్రముఖుల రెస్పాన్స్‌తో మరింత జోష్ లోకి వచ్చేసింది.


By March 14, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-comments-on-jathi-ratnalu-movie-unit/articleshow/81492068.cms

No comments