Breaking News

ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకెక్కిన ఒడిశా.. కోర్టు ధిక్కారణ పిటిషన్!


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు దశల్లో ఎన్నికలు జరగుతుండగా.. ఇప్పటికే మొదట విడత పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తమ భూభాగంలోని మూడు పంచాయతీలను పేరు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ కేసును వేసింది. ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని గ్రామాల్లో ఎన్నికల నిర్వహిస్దని పేర్కొంది. గంజాయ్‌పదర్‌ను గంజాయ్‌భధ్రగా, పట్టుసెనరీని పట్టుచెన్నూరుగా, ఫగలుసెనరీని పగులుచినేరుగా మార్చిందని తెలిపింది. గతంలో తాము ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించామని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మూడు పంచాయతీలను ఏకగ్రీవం చేశారని, పగులు చెన్నూరుగా పిలిచే ఫగలుసెనరీలో మాత్రం ఎన్నిక జరిగిందని పిటిషన్‌లో వివరించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్, సీఎస్‌ల నుంచి సంజాయిషీ కోరాలని విజ్ఞ‌ప్తి చేసింది. కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. అంతకు ముందు సోమవారం అడ్వకేట్ జనరల్‌ను కలిసిన కొరాపుట్ జిల్లా ఉన్నతాధికారులు.. ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఆంధ్రా ఒడిశా రీజియన్ అధికారి శంకర్ మిశ్రాకు ఒడిశా డిప్యూటీ సెక్రెటరీ భగవాన్ నాయక్ దీనిపై ఓ లేఖను రాశారు. ‘భూభాగంలో ఉన్న కోటియాలోని 3 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ దాఖలు చేయాలి’అని ఆదేశించారు. ‘గ్రామాలు ఒడిశా రాష్ట్ర పరిధిలోకి వస్తాయి... ఎన్నికలు నిర్వహించడం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యథాతథ స్థితి ఉల్లంఘన.. మేము ఇప్పటివరకు ఈ గ్రామాలలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాం.. కాబట్టి ఈ గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఎన్నికలు నిర్వహించగలదు?’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీజేపీ నాయకులు ఒడిశా-ఆంధ్రా వివాదాస్పద కొఠియా గ్రామాల్లోని గిరిజనులకు సూచించారు. కాగా, కొరాపుట్‌ జిల్లా కొఠియా పంచాయతీలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఒడిశా హైకోర్టులో పిల్‌ దాఖలయ్యింది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ వ్యాజ్యం నమోదు చేశారు.


By February 11, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-govt-file-petition-in-supreme-court-against-ap-panchayat-elections/articleshow/80822879.cms

No comments