Breaking News

నిర్ణయం తీసుకోవాల్సింది పోలీసులు.. మేం కాదు: రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీం వ్యాఖ్యలు


సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనకు 50 రోజులు పూర్తయ్యాయి. ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని రైతులు నిర్ణయించిన విషయం తెలిసింది. అయితే, ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వరాదంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకంగా శాంతి భద్రతల నిర్వహణ అనేది ఢిల్లీ పోలీసుల పరిధిలోదని, ట్రాక్టర్ల ర్యాలీ వల్ల తలెత్తే పరిస్థితులను పరిష్కరించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానానికి లేదని కేంద్రానికి స్పష్టం చేసింది. ఢిల్లీలోకి ప్రవేశించడం అనేది శాంతి భద్రతల అంశం.. ఇది పోలీసుల పరిధిలోకి వస్తుంది అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ సారన్‌ల ధర్మాసనం పేర్కొంది.. జనవరి 26న ట్రాక్టర్ మార్చ్‌తో రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించే న్యాయపరమైన ఉత్తర్వులను పొందాలనే కేంద్రం ఆసక్తి స్పష్టంగా ఉంది.. ఎందుకంటే పోలీసులు బలప్రయోగం చేయాల్సి వస్తే రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుంది. రైతుల ఆందోళనకు కోర్టు బాధ్యత వహించనందున క్షేత్రస్థాయి పరిస్థితి గురించి సుప్రీంకోర్టు తెలియజేయడం సముచితమని కేంద్రం, ఢిల్లీ పోలీసులు భావించారని అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ తెలిపారు. అయితే, ఈ అంశంపై జోక్యం చేసుకునేటప్పుడు నిబంధనలను ఆలోచించడం పొరపాటు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మేము ఒక సమస్యపై విచారణ జరుపుతున్నాం.. (మూడు వ్యవసాయ చట్టాల చట్టబద్ధత).. కోర్టు జోక్యం పూర్తిగా తప్పుడు అర్ధం అవుతుంది’ అని ధర్మాసనం పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజున వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించి, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్దమని, ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని అటార్నీ జనరల్ కే వేణుగోపాల్ అన్నారు. రిపబ్లిక్ డే వంటి రాజ్యాంగ విధులకు తప్పకుండా గౌరవంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ట్రాక్టర్లతో రైతులను ఢిల్లీలోకి రాకుండా నిరోధించాలని కోరుతూ రాజధాని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం.. ‘ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ ప్రవేశానికి రాజ్యాంగ న్యాయస్థానంగా మేము తొలుత అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం కుదరదు.. వారికి అనుమతించే అంశం పోలీసుల పరిధిలోది.. ఎంత మంది హాజరవుతారు.. షరతులు ఏంటి అనేది వారే నిర్ణయించాలి’ వ్యాఖ్యానించింది. ఈ సమస్యలన్నీ నిర్ణయించే అధికారం పోలీసులకే ఉన్నాయని కేంద్రానికి సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఉందా? జనవరి 12 న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది.. రైతులలో వ్యతిరేకించే అంశాలను పరిశీలించడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.


By January 19, 2021 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-not-court-to-decide-on-nod-for-tractor-rally-says-supreme-court/articleshow/80339782.cms

No comments