Breaking News

ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని వేలితో చూపించినట్టే: బాలకృష్ణ


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడటం అంటే సూర్యడిని వేలితో చూపించినట్టేనని ఆయన కుమారుడు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి అన్నారు. నేడు యన్.టి.రామారావు 25 వర్థంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు వారి అన్నగారు, దివంగతులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్థంతి సందర్భంగా ఈ ఘాట్‌కు వచ్చాం. ప్రతి ఏడాది అభిమానలు, కుటుంబ సభ్యులు ఈ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించడం ఆనవాయితీ. అలాగే, ఈ 25వ వర్థంతి సందర్భంగా అందరం వచ్చాం. రామారావు గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని వేలితో చూపించినట్టు అవుతుంది. అంటే, అంత ఉత్తమమైన, భారీ జీవితం ఆయనది. భూమి మీద ఎందరో పుడతారు, గిడతారు.. కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథాల్లో నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటిత దీక్ష పూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన ఎప్పుడూ ఇదే చెబుతుండేవారు. మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో చేసి చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక, బెదరక, తలవంచక ముందుకు సాగిన ధీరదాతుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడు, తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలల ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితం ఒక పెద్ద పాఠ్యాంశం. నేను ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు, నిర్లిప్తతలో ఉన్నప్పుడు, నిస్తేజం పొందినప్పుడు యన్.టి.ఆర్ అనే మూడు అక్షరాలు తలచుకుంటే ఎక్కడలేని ఒక ఆవేశం వచ్చేస్తుంది. రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టింది. అంటే, అంతకు ముందు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల కోవకు చెందినవారు యన్.టి.రామారావు’’ అని బాలకృష్ణ వెల్లడించారు.


By January 18, 2021 at 10:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-pays-tribute-to-ntr-on-his-25th-death-anniversary/articleshow/80322944.cms

No comments