ఆ వ్యాపారం వద్దని చెప్పినా పట్టించుకోని కూతురు.. సుపారీ కిల్లర్తో తల్లి కాంట్రాక్ట్
నవమాసాలు కనిపెంచిన కూతురిని హత్య చేసేందుకు కన్నతల్లే కిరాయి హంతకులను పురమాయించిన ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన సుకిరిగిరి అనే మహిళ కూతురు షిబానీ నాయక్ (36) కలిసి ఉంటోంది. షిబానీ కొంతకాలంగా అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తోంది. అలాంటి వ్యాపారం చేసి కుటుంబ పరువు తీయొద్దని, గౌరవంగా బ్రతకాలని సుకిరిగిరి తన కూతురికి ఎన్నోసార్లు నచ్చజెప్పినా ఫలితం కనిపించలేదు. దీంతో కూతురిని చంపేయాలని ఆమె నిర్ణయించుకుంది. షిబానీ నాయక్ను హత్య చేసేందుకు ప్రమోద్ జెనా అనే సుపారీ కిల్లర్తో రూ.50వేలకు ఒప్పందం కుదుర్చుకుని రూ.8వేలు అడ్వాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా తిరుగుతూ ప్రమోద్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా షిబానీ నాయక్ హత్యకు ఆమె తల్లి రచించిన పథకాన్ని మొత్తం పోలీసులకు చెప్పేశాడు. దీంతో పోలీసులు సుకిరిగిరిని అరెస్ట్ చేసి ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
By January 18, 2021 at 09:30AM
No comments