Breaking News

కొవాగ్జిన్ టీకా తీసుకున్న ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డ్‌కు తీవ్ర అనారోగ్యం


కరోనా వైరస్ టీకా పంపిణీ భారత్‌లో శనివారం ప్రారంభం కాగా.. అక్కడక్కడ వ్యాక్సిన్ తీసుకున్నవారికి స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొవాగ్జిన్ టీకా వేయించుకున్న సెక్యూరిటీ గార్డ్‌కు అలెర్జీ సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించారు. రణదీప్ గులేరియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిమ్స్ టీకా కేంద్రంలో కొవాగ్జిన్ డోస్ వేసుకున్న 15-20 నిమిషాల్లో సెక్యూరిటీ గార్డ్‌కు గుండె దడ, చర్మం దద్దుర్లు అభివృద్ధి చెందాయన్నారు. అతడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ‘అతడికి వెంటనే తగిన చికిత్స నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడింది.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది.. ముందు జాగ్రత్త చర్యగా రాత్రంతా అబ్జర్వేషన్‌లో ఉంచి పరిస్థితిని పర్యవేక్షించారు. నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఢిల్లీలోని వివిద కేంద్రాల్లో టీకా తీసుకున్నవారిలో ఒకరికి తీవ్రంగా, మరో 51 మంది స్వల్పంగా దుష్ప్రభావాలు తలెత్తినట్టు అధికారులు తెలిపారు. తొలి రోజు 11 పంపిణీ కేంద్రాల ద్వారా 8,117 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 4,319 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో శనివారం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీకి ద్వితీయ విఘ్నాలు ఏర్పాడ్డాయి. కోవిన్ యాప్‌లో సాంకేతిక లోపాలతో శనివారం మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రకటించింది. రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నామని, జనవరి 19న తిరిగి ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోనూ ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది.


By January 17, 2021 at 01:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aiims-security-guard-developed-allergic-reaction-to-vaccine-stable-says-director/articleshow/80312094.cms

No comments