Breaking News

దేశంలోనే కరోనాకు తొలి టీకా జైపూర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు


మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శనివారం (జనవరి 16) భారత్ శ్రీకారం చుట్టింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మొత్తం 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ చేపట్టగా.. దేశంలోనే తొలి వ్యాక్సిన్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సుధీర్ భండారీ తీసుకున్నారు. ఆయనకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కోవీషీల్డ్‌ తొలి డోస్ వేశారు. ఇక, తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా ఇవ్వనున్నట్టు పీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో వైద్య సిబ్బందికి టీకా అందజేయనున్నారు. తొలుత ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులకు, తర్వాత ప్రయివేట్ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. రెండో దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ తెలియజేశారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోదీ సూచించారు. దేశంలో రెండు టీకాలు అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. అయితే, ప్రస్తుతం కోవిషీల్డ్ టీకా డోస్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో కోవిషీల్డ్ డోస్‌లను అధికంగా, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ డోస్‌లు నామమాత్రంగానే వినియోగిస్తున్నారు. తొలుత 0.5 ఎంఎల్ డోస్‌ ఇచ్చిన తర్వాత.. రెండో డోస్‌ను 28 రోజుల తర్వాత అందజేయనున్నారు. టీకా పంపిణీ కోసం ప్రతి రాష్ట్రంలోనూ మూడంచెల నిల్వ వ్యవస్థను అనుసరిస్తున్నారు. రాష్ట్రస్థాయి, డివిజన్‌స్థాయి, జిల్లాస్థాయి నిల్వ కేంద్రాలను ఏర్పాటుచేశారు.


By January 16, 2021 at 11:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jaipur-sms-medical-college-principal-get-first-shot-of-covid-vaccine-in-india/articleshow/80298618.cms

No comments