చాలా కష్టపడ్డా.. కానీ సడెన్గా బై చెప్పాల్సి వస్తోంది.. కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/79703536/photo-79703536.jpg)
ఈ మధ్యకాలంలో పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. తాజాగా తన లేటెస్ట్ మూవీ '' గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దివంగత నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'తలైవి'లో కంగనా లీడ్ రోల్ పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో కంగనా కాస్త ఎమోషనల్ అవుతూ ఈ మూవీ షూటింగ్, తన అనుభవం గురించి పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. ''ఓ యాక్టర్కి ఇలాంటి పాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ పాత్రను ఎంతో ఇష్టంగా ప్రేమలో చేశాను. విప్లవ నాయకురాలిగా చేయడం సంతోషాన్నిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాం. డైరెక్టర్ విజయ్, విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, విజయేంద్ర ప్రసాద్, బృంద ప్రసాద్, నీతా లుల్లా, రజత్ సరోరా, బల్లూసలూజ, జీవీ ప్రకాశ్, అరవింద స్వామి వంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడ్డా.. కానీ సడెన్గా బై చెప్పాల్సి వస్తోంది'' అని పేర్కొంటూ జయలలితగా తన లుక్ పోస్ట్ చేశారు కంగనా. Also Read: ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'తలైవి' చిత్రానికి విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్ త్వరత్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేస్తామని అంటోంది. జయలలిత జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఈ మూవీని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
By December 13, 2020 at 10:55AM
No comments