ఒకే రోజు.. ఒకే వేదికపై వివాహం చేసుకున్న తల్లీకూతళ్లు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/79703229/photo-79703229.jpg)
తల్లిదండ్రులకు పిల్లలు పెళ్లిళ్లు జరిపించడం సర్వసాధారణమే అయినా, తల్లీకుమార్తెలు ఒకే వివాహ వేదికపై, ఒకే రోజు వివాహం చేసుకున్న ఆసక్తికర ఘటన ఉత్తర్ప్రదేశ్లో గురువారం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ్ యోజనలో భాగంగా గోరఖ్పూర్ కళ్యాణమండపం దీనికి సాక్షిగా నిలిచింది. బెలి దేవి (53) భర్త హరిహర్ 25 ఏళ్ల కిందట చనిపోగా.. అప్పటికే వారికి ఐదుగురు సంతానం ఉన్నారు. దీంతో పిల్లల కోసం ఒంటరిగా ఉండిపోయింది. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులుకు వివాహం చేసింది. Read Also: తాజాగా, చిన్న కుమార్తెకు వివాహం నిశ్చయం కాగా.. తాను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో తన భర్త సోదరుడు, బావ జగదీష్ (55)నే బెలి దేవి పెళ్లి చేసుకుంది. ఆయన కూడా ఒంటరిగానే ఉండటంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త జీవితం ప్రారంభించిన బెలి దేవి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఇద్దరు కొడుకులు, కుమార్తెలకు వివాహం అయ్యింది... ప్రస్తుతం నా చిన్న కూతురికి పెళ్లి జరుగుతుండగా.. నేనూ మా బావను వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.. దీనికి నా పిల్లలు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు’ అని పేర్కొంది. Read Also: నా తల్లి, బాబాయి మమ్మల్ని చూసుకున్నారు.. ఇప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని దేవి కుమార్తె ఇందు హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ్ యోజనలో భాగంగా గోరఖ్పూర్లో గురువారం మొత్తం 63 జంటలు వివాహం బంధం ద్వారా ఒక్కటయ్యాయి. వీరిలో బెలిదేవి, ఆమె కుమార్తె ఇందు ఉన్నారు. రాహుల్ అనే యువకుడితో ఇందుకు వివాహం జరిగింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సహా ఇతరులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. Read Also:
By December 13, 2020 at 10:26AM
No comments