Breaking News

దోషిగా తేలిన చట్టసభ్యుడి ఓటు చెల్లుబాటు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు


చట్టసభల్లో నేరచరితుల అంశంపై దేశవ్యాప్తంగా ముమ్మర చర్చ జరుగుతున్న వేళ.. సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక తీర్పును శుక్రవారం వెలువరించింది. నేరం రుజువై దోషిగా తేలిన ప్రజాప్రతినిధి ఓటు చెల్లుబాటుపై తీర్పు వెల్లడించిన .. దోషిగా తేల్చిన సందర్భంలో తీర్పు వెలువడే సమయం ముందు వరకూ ఆ వ్యక్తి ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. తీర్పు వెలువరించడానికి ముందే ఆ వ్యక్తి ఓటు చెల్లుబాటు కాదని చెప్పలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే ఆ ప్రజాప్రతినిధి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. మార్చి 23,2018న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే అమిత్‌కుమార్‌ మహతో ఉదయం 9.15 నిమిషాలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ ప్రసాద్ సాహూకి ఓటేశారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ కేసులో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చింది. అప్పటికే అమిత్ ఓటువేయడంతో లెక్కింపులో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. తత్ఫలితంగా బీజేపీ నుంచి పోటీచేసిన రాజ్యసభ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌ సోంతాలియా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ విజయం సాధించడంతో దీన్ని సవాల్ చేస్తూ ప్రదీప్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. అమిత్‌కుమార్ ఓటు చెల్లబాటుకాదని, ధీరజ్ ప్రసాద్ సాహును ఎన్నిక చెల్లదని వాదించారు. ఆయన ఎన్నికల పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 17న కొట్టేసింది. దీంతో ప్రదీప్‌కుమార్ సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోపన్న, వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి 32 పేజీల తీర్పును వెలువరించారు. ‘నేరనిర్ధారణ అనేది కారణం.. అనర్హత పరిణామం... పరిణామానికి కారణం ఎప్పుడూ ఉండదు’ అని వ్యాఖ్యానించారు.


By December 19, 2020 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lawmakers-vote-before-conviction-is-valid-sc-verdict-on-jharkhand-bjp-leader-case/articleshow/79807375.cms

No comments