Breaking News

విజయవంతంగా సాగుతోన్న భారత్ బంద్. పలు రాష్ట్రాల్లో ఆగిపోయిన రైళ్లు, బస్సులు


కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన విజయవంతంగా సాగుతోంది. రైతుల పిలుపునకు ఉద్యోగ, కార్మిక సంఘాలు, విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. రహదారులు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాగరాజ్‌లో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకోగా.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రైతులు, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ఘెరావ్ చేశారు. బంద్ సందర్భంగా ఎవరైనా 3 గంటలపాటు ఇరుక్కుపోతే వారికి మంచినీరు, పండ్లను ఇస్తామని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ తెలిపారు. వారణాసి-గ్వాలియర్ మధ్య నడిచే బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాగరాజ్‌లో కార్యకర్తలు ఆపివేశారు. భారత్ బంద్ సందర్భంగా భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రైల్వే రవాణా సంఘాలు బంద్‌కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెట్‌ను తెరిచినా రైతుల బంద్‌కు మద్ధతు ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోపాటు పలు ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి కీలకమైన రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇది కొనసాగనుంది. బంద్ సందర్భంగా సాధారణ జన జీవనం స్తంభించి పోయింది. సామాన్య ప్రజలకు సమస్య లేకుండా బంద్ పాటిస్తున్నామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. దుకాణదారులు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నుంచి అత్యవసర, అంబులెన్సు, ఆసుపత్రి సేవలను మినహాయించారు. పంజాబ్, హర్యానాలలో రవాణ ట్రక్ యూనియన్ లు బందుకు మద్ధతు ప్రకటించారు. భారత్ బంద్ సందర్భంగా పాలు, కూరగాయల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. బంద్ సందర్భంగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీ సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు మండీలు మూసివేశారు.


By December 08, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-bandh-protesters-stop-trains-in-uttar-pradesh-and-maharashtra-odisha/articleshow/79618447.cms

No comments