Breaking News

Sitara: మహేష్ బాబు ఫన్ మోడ్.. ప్రతిరోజూ ప్రకాశిస్తూనే ఉండండి అంటూ మనసును హత్తుకునే పోస్ట్


సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన కొడుకు, కూతురుతో పాటు చిన్నారులంటే ప్రాణం అనే సంగతి తెలిసిందే. ఏ మాత్రం సమయం దొరికినా తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు మహేష్. ఇక వీలుచిక్కినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరించడం ఆయన హ్యాబీ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హాలీడే ట్రిప్‌ వేసిన మహేష్.. ప్రస్తుతం దుబాయ్‌లో సేద తీరుతున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా 8 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమైన సూప‌ర్ స్టార్ .. ఇటీవలే భార్య నమ్రత, కొడుకు, కూతురు లతో కలిసి దుబాయ్ ఫ్లైటెక్కారు. ప్రస్తుతం అక్కడి అందమైన ప్రదేశాలు చుట్టేస్తూ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆయన.. చిల్డ్రన్స్ డే సందర్భంగా మనసుకు హత్తుకునే సందేశం పోస్ట్ చేశారు. Also Read: దుబాయ్ ట్రిప్‌లో గౌతమ్, సితారలతో ఫన్ మోడ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ''ముగింపు లేని నవ్వులు, సరదా, ప్రేమ.. నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. నా రెండు చిన్న పిల్లర్స్‌‌తో పాటు ఈ ప్రపంచం లోని పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రతిరోజూ ప్రకాశిస్తూనే ఉండండి'' అని పేర్కొన్నారు మహేష్. ఈ ఫొటోలో ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మహేష్ కనిపిస్తుండటం సూపర్ స్టార్ అభిమానులకు కన్నుల పండగగా మారింది. ఈ ఏడాది ఆరంభం లోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న మహేష్ బాబు.. మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సెట్స్ మీదకు రానున్నారు. సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. Also Read:


By November 15, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-enjoying-with-his-childrens-in-dubai/articleshow/79229436.cms

No comments