Breaking News

మహిళతో అర్ధరాత్రి ఊరిచివరికి.! సూర్యాపేటలో దారుణం


జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళతో అర్ధరాత్రి వేళ ఊరిచివరికి వెళ్లిన గ్రానైట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అమాంతం దుండగులు అతనిపై కర్రలు, బండరాయితో దాడి చేసి కిరాతకంగా చంపేశారు. వ్యాపారిపై దాడి సమయంలో మహిళ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేక వ్యాపార లావాదేవీల్లో తేడాల వల్లే చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడుకి చెందిన వెనిశెట్టి రంగనాథ్(45) కుటుంబం 35 ఏళ్ల కిందట ఖమ్మం వచ్చి స్థిరపడింది. రంగనాథ్ గ్రానైట్ క్వారీ వ్యాపారం చేసేవాడు. రెండు రోజుల కిందట బంధువైన మహిళతో కారులో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని ఓ బండ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి వచ్చాడు. అదే సమయంలో ముగ్గురు దుండగులు రంగనాథ్‌పై దాడి చేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టడంతో భయపడిపోయిన మహిళ అక్కడి నుంచి పరుగులు తీసింది. దుండగుల నుంచి తప్పించుకునేందుకు రంగనాథ్ పొలాల వైపు పరిగెత్తాడు. వెంటాడిన దుండగులు బండరాయితో తలపై మోది కిరాతకంగా చంపేశారు. మరుసటి రోజు రైతులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ని రప్పించారు. రాత్రివేళ అక్కడి నుంచి పారిపోయిన మహిళ మరుసటి రోజు అటువైపుగా వచ్చింది. జనం గుమికూడి ఉండడంతో అక్కడికి వచ్చి శవమై పడి ఉన్న రంగనాథ్‌ను చూసి పోలీసులకు వివరాలు వెల్లడించింది. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వ్యాపారితో కలసి వచ్చిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుండగులెవరో తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశారా? లేక వ్యాపార లావాదేవీలే కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. Also Read:


By November 24, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/businessman-killed-brutally-in-suryapet/articleshow/79383367.cms

No comments