Breaking News

మద్యం మత్తులో పైశాచికం.. 90 ఏళ్ల బామ్మపై యువకుడి అఘాయిత్యం


మహిళలపై నేరాలకు అడ్డుకట్టలేకుండా పోతోంది. నిత్యం ఏదో చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. న్యాయస్థానాలు ఉరి శిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి యథేచ్ఛగా దారుణాలకు తెగబడుతున్నారు. తొంభై ఏళ్ల ముదిమి వయస్సులో ఉన్న బామ్మపై యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించిన అత్యంత అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు జిల్లా పొలాచ్చికి చెందిన వృద్ధురాలు(90) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమరన్ నగర్‌కి చెందిన మైదీన్(20) ఇంట్లోకి చొరబడ్డాడు. గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని అత్యాచారం చేసేందుకు యత్నించాడు. పక్క గదిలో కుటుంబంతో సహా నిద్రిస్తున్న ఆమె కుమారుడు(55) తల్లి కేకలు విని వెంటనే రావడంతో మైదీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: పారిపోతున్న మైదీన్‌ని గుర్తించిన బాధితురాలి కుమారుడు మరుసటి రోజు బంధువులు, స్థానికుల సాయంతో అతన్ని పట్టుకుని పొలాచ్చి వెస్ట్ పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైదీన్ కూలీ పనులు చేసుకునేవాడని.. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. Read Also:


By November 15, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/youth-attempts-to-rape-90-year-old-woman-in-tamil-nadu/articleshow/79229382.cms

No comments