Breaking News

రూ.10 కోట్ల ఫైన్ చెల్లించిన శశికళ.. డబ్బు సమకూర్చిన ఓ కీలక నేత!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో ఆమె స్నేహితురాలు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్‌లో జైల్లో ఉన్న శశికళ.. ఈ కేసులో కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను చెల్లించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారంలో ఉండాలని అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ మైఖేల్‌ జె.కున్హా తీర్పు వెలువరించారు. వచ్చే ఏడాది జనవరి 27కు ఆమె శిక్షాకాలం పూర్తి కానుంది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా యాక్సిస్‌ బ్యాంకు, భారతీయ స్టేట్‌ బ్యాంకులకు చెందిన 2 డిమాండు డ్రాఫ్ట్‌లను (తలా రూ.5 కోట్లు) బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు కార్యాలయంలో అందజేసినట్టు శశికళ తరఫు న్యాయవాది రాజా సెంతూర్‌ పాండ్యన్‌ తెలిపారు. జరిమానా చెల్లింపు గురించి జైలు అధికారులకు న్యాయస్థానం తెలియజేస్తుందని, జనవరి 27 కంటే ముందే ఆమె విడుదల అవుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆమె తరఫున ఒక రాజకీయ నాయకుడు సమకూర్చారు. ఇదిలా ఉండగా.. శశికళ జైలు నుంచి విడుదలై వచ్చినా ఆమెను, ఆమె కుటుంబాన్ని అన్నాడీఏంకేలోకి అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి వ్యాఖ్యానించడం విశేషం. ఈ విషయమై పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. శశికళతోపాటు ఆమె బంధువులు వీఎన్ సుధాకరన్, ఇళవరసి ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ విడుదల ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, గత నెలలో శశికళ, ఆమె బంధువులకు చెందిన రూ.1,500 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఆమె జైలు నుంచి విడుదలై వచ్చినా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది.


By November 19, 2020 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-tamil-nadu-cm-jayalalithaa-aid-vk-sasikala-pays-10-crore-fine/articleshow/79294322.cms

No comments