Breaking News

జర్నలిస్ట్‌ను నడిరోడ్డుపై స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టిన ల్యాండ్ మాఫియా


జర్నలిస్ట్‌పై ల్యాండ్ మాఫియా దాడికి పాల్పడిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘనలో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మిర్జాకు చెందిన జర్నలిస్ట్ మిలాన్ మహంతాను నిందితులు నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ పోల్‌కి కట్టేసి, దారుణంగా హింసించారు. అసోం దినపత్రిక అసోమియా ప్రాదితిన్‌లో గత 20ఏళ్లుగా పనిచేస్తున్న మిలాన్.. క్రైమ్ వార్తలను రాస్తుంటారు. ఈ దాడి వెనుక ల్యాండ్, గ్యాంబ్లింగ్ మాఫియా ఉందని మిలాన్ ఆరోపిస్తున్నారు. ‘నన్ను చంపాలనే వారు నిర్ణయించుకున్నారు.. వారికి వ్యతిరేకంగా అనేక కథనాలు రాశారు.. నన్ను కాపాడటానికి ప్రయత్నించివారిపై కూడా దాడిచేశారు.. మూడు రోజుల కిందట ఈ ఘటన జరిగినా పోలీసులు ఇప్పటి వరకూ నా ఇంటికొచ్చి వివరాలను తెలుసుకోలేదు’ అని మహంతా వాపోయారు. ఈ ఘటనపై స్థానిక జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ అసోం వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఈ దాడిలో మహంతా కుటుంబం భయాందోళన చెందుతోందని, ఇప్పటి వరకు ఒక్కర్ని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా హింసిస్తే పోలీసులు ఇంత వరకు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు.. జర్నలిస్ట్‌ల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకురావాలని నైరేన్ మలీ అనే ఓ జర్నలిస్ట్ డిమాండ్ చేశారు. ఈ దాడిలో మహంతాకు బయటకు కనిపించని గాయాల్యాయి. మహంతా నిజాయితీ గురించి ఇక్కడ ప్రజలందరికీ తెలుసని.. న్యూస్ విషయంలో ఆయన ఎప్పుడూ ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదు.. ఆయన నిబద్ధతకు మేమెంతో గర్విస్తున్నాం’ అని ఆయన భార్య టూటుమోని దాస్ మహంతా అన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇప్పటి వరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితుల మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని అన్నారు. జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులు స్థానిక రౌడీ మూకలని, వీరి చర్యలతో చుట్టుపక్కల జనం ఇబ్బంది పడుతుంటారని ఓ పోలీస్ అధికారి అన్నారు.


By November 19, 2020 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/journalist-tied-pole-and-beaten-by-land-mafia-in-busy-roads-in-assam/articleshow/79294628.cms

No comments