Breaking News

యువకుడి తల తీసుకెళ్లిన ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’.. షాకింగ్ ఘటన


యువకుడి మొండెం, తల వేర్వేరు రాష్ట్రాల్లో లభ్యమైన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలపై పడి ఉన్న యువకుడి మొండెం తాలూకు తల సుమారు 1300 కిలోమీటర్లు ప్రయాణించి పొరుగు రాష్ట్రంలో కనిపించింది. ఈ షాకింగ్ ఘటన వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ వద్ద రైలు పట్టాలపై ఈ నెల 3వ తేదీన ఛిద్రమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. తల లేకుండా మొండెం మాత్రమే ఉండడం సంచలనం కలిగించింది. అయితే యువకుడి తల బెంగళూరులో బయటపడింది. రైలు పట్టాలపై మృతి చెందిన యువకుడి తల రైలింజన్‌ కింది భాగంలో ఇరుక్కుపోయి చేరింది. తలను గుర్తించిన బెంగళూరు రైల్వే పోలీసులు ఫొటోలు తీసి విచారణ చేపట్టడంతో మధ్యప్రదేశ్‌లో తలలేని మొండం లభ్యమైనట్లు గుర్తించారు. ఈ సమాచారంతో చేరుకున్న బెంగళూరు పోలీసులు ఆ తల బేతుల్‌కి చెందిన రవి మర్మామ్(28)గా గుర్తించారు. Also Read: రైలు పట్టాలపై పడి ఉన్న రవి మృతదేహం నుంచి తల విడిపోయి రైలు కిందిభాగంలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. అలా బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది. రైలు అతడి తల మీద నుంచి వెళ్లడం వల్లే అతను మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అయితే రవిని బలవంతంగా పట్టాలపైకి తెచ్చి హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Read Also:


By October 17, 2020 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-youth-head-found-in-bengaluru/articleshow/78715566.cms

No comments