Breaking News

ఆ పోలీస్‌కు ఎంత ధైర్యం ప్రియాంక కుర్తా పట్టుకుని లాగుతుడా? బీజేపీ నేత ఆగ్రహం


హథ్రాస్ బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాద్రా పట్ల ఓ పోలీస్ ప్రవర్తించిన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీ- యూపీ సరిహద్దు వద్ద శనివారం ప్రియాంక కుర్తా పట్టుకుని ఓ పోలీస్ లాగడం వివాదాస్పదమయ్యింది. ఈ ఘటనపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, మహారాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సైతం యూపీ పోలీస్ చర్యపై మండిపడ్డారు. ప్రియాంక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్‌పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రియాంకకు మద్దతుగా నిలిచిన వాఘ్.. ఓ మహిళా రాజకీయ నేత దుస్తులను లాగడానికి పోలీస్‌కు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. పోలీసులు తమ పరిధులను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతిని నమ్మో యోగి ఆదిత్యనాథ్ జీ.. ఈ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ట్విట్ చేశారు. ప్రియాంక గాంధీ దుస్తులు పట్టుకుని లాగుతోన్న ఫోటోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తొలిసారి గురువారం బాధిత కుటుంబాన్ని కలవడానికి రాహుల్ గాంధీ, ప్రియాంకలు హథ్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఓ జాతీయస్థాయి నాయకుడి పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టాయి. ప్రియాంక పట్ల తమ సిబ్బంది వ్యవహరించిన తీరుకు గౌతమ్‌బుద్ధ నగర్ పోలీసులు క్షమాపణలు చెప్పారు. శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఈ ఫోటోను షేర్ చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, 'యోగిజీ పాలనలో మహిళా పోలీసు ఉంది కదా?' అని నిలదీశారు.


By October 05, 2020 at 12:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leaders-tweet-on-uttar-pradesh-police-manhandling-priyanka-gandhi/articleshow/78487959.cms

No comments