Breaking News

చాక్‌పీస్ తినొద్దన్నాడని భార్య అఘాయిత్యం.. హైదరాబాద్‌లో విషాద ఘటన


హైదరాబాద్‌లో విషాద ఘటన వెలుగుచూసింది. చాక్‌పీస్ తినొద్దని భర్త మందలించాడని భార్య అఘాయిత్యానికి ఒడిగట్టింది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకుంది. అయోధ్యనగర్‌లో నివాసముంటున్న సంజూ యాదవ్(21)కి చాక్‌పీస్ తినే అలవాటు ఉంది. రోజూ చాక్‌పీసులు తింటున్న భార్య సంజూని భర్త మందలించాడు. చాక్‌పీసులు తినొద్దని వారించడంతో మనస్థాపానికి గురై చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By October 13, 2020 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-commits-suicide-in-jeedimetla-of-hyderabad/articleshow/78632984.cms

No comments