Breaking News

మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: డబ్ల్యూహెచ్‌వో


కరోనా మహమ్మారితో దేశాలు విలవిల్లాడుతున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ్నమ్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దేశాలు ప్రజారోగ్యంపై ఎక్కువగా ఖర్చు చేయాలని సూచించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన టెడ్రోస్.. కరోనా చివరి మహమ్మారి కాదన్నారు. వైరస్ వ్యాప్తి చెందడం, మహమ్మారులనేవి జీవిత సత్యాలని చరిత్ర మనకు చెబుతోందన్నారు. మరో మహమ్మారి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఇప్పటి కంటే ప్రపంచం మరింత సన్నద్ధంగా ఉండాలని చీఫ్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ల మంది బారిన పడగా.. 8.8 లక్షల మందికిపైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి విషయంలో చైనా సరిగా సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కోవిడ్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని.. మనుషుల నుంచి మనుషులకు సోకదంటూ.. తొలినాళ్లలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కానీ అనంతరం ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని, గాలి ద్వారానూ వ్యాపి చెందుతుందని ప్రకటించింది. కానీ అప్పటికే ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది.


By September 08, 2020 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-19-will-not-be-the-last-we-must-be-better-prepared-for-next-pandemic-who-chief/articleshow/77988613.cms

No comments