Breaking News

ప్రియుడితో పెళ్లికి ఓకే చెప్పిన పెద్దలు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య


పెళ్లి ఆలస్యం అవుతోందన్న బెంగతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా మండలంలో జరిగింది. ఎల్లంపల్లి గ్రామానికి వడిగె నర్సింగం దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆయన ప్రస్తుతం సౌదీఅరేబియాలో గొర్రెల కాపరిగా పనిచేస్తుండగా, భార్య గ్రామంలోనే వ్యవసాయకూలీగా పనిచేస్తోంది. వీరి పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం కాగా.. చిన్న కూతురు శిరీష (20) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. Also Read: కోహెడ మండలం మైసంపల్లికి చెందిన వజ్జెపల్లి శ్రావణ్‌, శిరీష మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇటీవలే పెద్దలు అంగీకారం తెలిపి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా లాక్‌డౌన్ విధించడంతో నర్సింగం స్వదేశానికి రాలేకపోయాడు. అయితే తనకు వెంటనే పెళ్లి చేసేయాలంటూ శిరీష తల్లిని తరుచూ కోరుతోంది. ‘కన్నతండ్రి లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటావ్, కొద్దిరోజులు ఆగితే నాన్న వచ్చేస్తారు, అప్పుడు ఘనంగా నీ పెళ్లి చేస్తాం’ అని తల్లి ఎంత నచ్చజెప్పినా శిరీష వినిపించుకోవడం లేదు. Also Read: తన పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో కొద్దిరోజులుగా శిరీష డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 28వ తేదీన ఇంట్లోనే పురుగులమందు తాగేసింది. గమనించిన తల్లి స్థానికుల సాయంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించింది. శిరీష తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 08, 2020 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-siddipet-district-over-marriage-issue/articleshow/77988636.cms

No comments