Breaking News

కొత్త కాపురంలో కరోనా చిచ్చు.. భార్య ఉరేసుకున్న తాడుతోనే భర్త..


కొత్త కాపురంలో కరోనా చిచ్చురాజేసింది. భర్తకి కరోనా వచ్చినప్పటి నుంచి నవ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆవేశంలో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్ధాపం చెందిన భర్త అదే తాడుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ అత్యంత విషాద ఘటన రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. నగరంలోని వెస్ట్ మాంబలంకి చెందిన మణికందన్(‌35)కి పది నెలల కిందట రాధిక(29)తో వివాహమైంది. భర్త పెరుంబాక్కమ్‌లోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తుండగా భార్య కిల్పాక్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ వెస్ట్ మాంబలంలో కాపురం పెట్టారు. మహమ్మారి కరోనా వారి కొత్త కాపురంలో చిచ్చుపెట్టింది. భర్తకి రెండు నెలల కిందట కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆలుమగల మధ్య గొడవలు మొదలయ్యాయి. చీటికీమాటికీ ఘర్షణ జరుగుతుండడంతో ఇటీవల భార్య కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. Also Read: పదిహేను రోజుల అనంతరం మళ్లీ ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో భార్య ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించడగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త ఇంటికి తిరిగి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఉరేసుకున్న తాడుతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By September 20, 2020 at 02:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-newly-married-couple-commits-suicide-following-quarrel-over-coronavirus/articleshow/78215726.cms

No comments