Breaking News

‘కాశీ-మథుర’పై దృష్టిసారించిన హిందూత్వ శక్తులు.. ఏబీఏపీ కీలక నిర్ణయం


దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి తెరపడి, మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నేపథ్యంలో హిందుత్వ శక్తులు కాశీ, మథుర ఆలయాలపై దృష్టిసారించాయి. మథురలోని కృష్ణజన్మస్థలం, వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయానికి విముక్తి కల్పించేందుకు ఉద్యమించాలని అఖిల భారతీయ అఖాడా పరిషత(ఏబీఏపీ) నిర్ణయించింది. ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరష్కారానికి కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న సాధువులు, సన్యాసులు నిర్ణయించారు. పరిష్కారమైనందున ఇప్పుడిక కాశీ, మథుర స్థలాలకు విముక్తి కల్పించాల్సిఉందని ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి పేర్కొన్నారు. ఈ రెండు వివాదాలను పరిష్కరించుకునేందుకు హిందూ, ముస్లింలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తొలుత చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మధురలోని ఇద్గాను అప్పగించాలని సంబంధిత పార్టీలకు ఏబీఏపీ విజ్ఞప్తి చేసింది. అలాగే, ఈ విషయంలో విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహకరించాలని కోరింది. అయోధ్యలోని రామజన్మభూమి వివాదం మాదిరిగానే కాశీ, మథుర ఆలయాల అంశాన్ని బీజేపీ తలక్కెత్తుకుంటుందా? అనేది వేచిచూడాల్సిందే. ఇక, కాశీలోని జ్ఞాన్వాపి మసీదు వెలిసిన ఆ స్థలంలో మహారాజా విక్రమాదిత్యుడు 2 వేల ఏళ్లకు పూర్వమే ఆలయాన్ని నిర్మించారని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్‌ 1991లో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొంది. క్రీ.శ. 1664లో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదును నిర్మించారని ఆరోపించింది. మసీదును అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ వివాదం అలహాబాద్ హైకోర్టులో ఉంది.


By September 09, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/time-has-come-for-the-liberation-of-kashi-mathura-temples-says-akhil-bharatiya-akhara-parishad/articleshow/78009396.cms

No comments