Breaking News

ఢిల్లీలో మరో దారుణం... 90 ఏళ్ల వృద్దురాలిపై యువకుడి అత్యాచారం


దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 90 ఏళ్ల వృద్ధ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నజఫ్‌నగర్‌లోని చావ్లా ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. చావ్లా ప్రాంతంలో ఓ వృద్ధురాలు(90) ఒంటరిగా ఉంటోంది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాలు పోసే వ్యక్తి కోసం ఇంటి బయట ఎదురుచూస్తోంది. ఆమెను గమనించిన ఓ వ్యక్తి ఈ రోజు పాలుపోసే వ్యక్తి రానని చెప్పాడని, దగ్గర్లోనే తనకు తెలిసిన పాల బూత్‌ ఉందని చెప్పి ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు. Also Read: వృద్ధురాలిని మాటల్లో దించిన ఆ కామాంధుడు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ‘నీకు నాయనమ్మ లాంటి దానిని వదిలేయ్’ అని వేడుకున్నా ఆ కామాంధుడు పట్టించుకోకుండా పశువులా ఆమెపై పడి కామవాంఛ తీర్చుకున్నాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికే వృద్ధురాలు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. పారిపోతున్న నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read: ఈ ఘటనపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ మీనా మాట్లాడుతూ... వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప్లంబర్‌గా గుర్తించామని, అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జి చేశారని వెల్లడించారు. ఈ ఘటన ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. Also Read:


By September 09, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-horrifying-90-years-old-woman-raped-and-brutally-thrashed/articleshow/78009317.cms

No comments