Breaking News

భూతగాదాలతో వ్యక్తిని కిరాతకంగా పొడిచి హత్య.. హైదరాబాద్‌ శివారులో దారుణం


భూ తగాదాలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాయి. వివాదంపై మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచిన దుండగులు అతడిని కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఈ ఘటన శివారు రంగారెడ్డి జిల్లా సర్కిల్ శివరాంపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. శివరాంపల్లిలోని ప్రజాభవన్‌ ఎదుట ఓ వ్యక్తి హత్య జరిగినట్లు స్థానికుల సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా కిషన్‌బాగ్‌ చెందిన మహ్మద్‌ జావేద్‌(45)గా గుర్తించారు. Also Read: సంఘటనా స్థలానికి సమీపంలోనే ఓ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించి పోలీసులు.. భూ తగాదాల వల్లే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలి వద్ద రెండు సెల్‌ఫోన్లు, నంబర్ ప్లేట్ లేని ఓ పల్సర్‌ బైక్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌చక్రవర్తి పరిశీలించి వివరాలు సేకరించారు. జావేద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. Also Read:


By September 09, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-murdered-in-hyderabad-over-land-disputes/articleshow/78008984.cms

No comments