Breaking News

బిస్కెట్లు ఇస్తానని చెప్పి బాలికని తీసుకెళ్లి.. కర్నూలులో ఘోరం


ఆరేళ్ల చిన్నారిపై చేసిన అమానుష ఘటన ఏపీలోని జిల్లాలో జరిగింది. సంజామల మండలం గిద్దలూరుకి చెందిన వ్యవసాయ కూలీ దంపతుల కూతురిపై అదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు నీచానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికకు బిస్కెట్లు, చాక్లెట్లు కొనిపెడతానని ఆశచూపి ఎత్తుకెళ్లాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వారం రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం బాగోకపోవడం.. నీరసంగా ఉంటుండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో దారుణం బయటపడింది. బాలికను బాత్రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలియడంతో కూలీ దంపతులు వెంటనే సంజామల పోలీసులను ఆశ్రయించారు. బాలుడిపై అత్యాచారం, పోక్సో తదితర కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Read Also: Also Read:


By September 11, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6-year-old-girl-raped-in-kurnool-district/articleshow/78053960.cms

No comments