Breaking News

రూ.3వేల కోసం ఫ్రెండ్‌నే చంపేశాడు.. మద్యం మత్తులో కిరాతకం


ఆర్థిక విషయాలు మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజెప్పే ఘటన ఇది. కేవలం రూ.3వేల కోసం స్నేహితుడినే దారుణంగా చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన చేవెళ్లలో జరిగింది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన బోయిని సత్తయ్య (40) కుటుంబ కలహాల కారణంగా భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న అతని సోదరుడు ఆంజనేయులు వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. Also Read: ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఒగ్గు శివరాజు అలియాస్‌ బీర్ల శివ (23)తో సత్తయ్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మద్యం తాగేవారు. ఆగస్టు 29న సాయంత్రం ఇద్దరూ గ్రామంలోని కల్లు దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ సత్తయ్య జేబులో డబ్బులు కనిపించడంతో వాటిని కాజేయాలని శివ ప్లాన్ వేశాడు. మద్యం తాగుదామని గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. సత్తయ్య మద్యం తాగి మత్తులోకి జారుకోగానే శివ బండరాయితో అతడి తలపై మోది చంపేశాడు. అనంతరం సత్తయ్య చొక్కా జేబులో ఉన్న రూ.3వేల నగదును తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. Also Read: మరుసటి ఉదయం గుట్టల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు చేవెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని సీసీటీవీ పుటేజీ పరిశీలించగా సత్తయ్య, శివ కలిసి నడుచుకుంటూ కనిపించారు. దీంతో పోలీసులు శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని గురువారం చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. Also Read:


By September 04, 2020 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drunked-man-kills-his-friend-for-rs-3000-money-in-ranga-reddy-district/articleshow/77922591.cms

No comments