Breaking News

Murder: అమృత పిటిషన్‌పై విచారణ.. వర్మకు షాకిచ్చిన కోర్టు! ఇదీ సంగతి


సంచలన దర్శకుడు లేటెస్ట్ మూవీ ''పై విడుదలకు ముందే వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తండ్రీకూతుళ్లు మారుతీరావు, అమృతల మధ్య అనుబంధం మొదలుకొని ప్రణయ్‌తో ప్రేమ, పెళ్లి.. హత్య వరకు అన్ని సన్నివేశాలను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై వ్యతిరేకత చోటుచేసుకుంది. మర్డర్ ఫస్ట్‌లుక్ విడుదలైన వెంటనే అమృత మీడియా ముందుకొచ్చి.. ప్రశాంతంగా ఉన్న తమ బ్రతుకులను వర్మ బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆవేదన చెందింది. అయినప్పటికీ సినిమా వర్మ టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వెంటనే సినిమా ప్రమోషన్స్, విడుదల ఆపాలంటూ అమృత నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. Also Read: తన అనుమతి లేకుండా తనపై అభ్యంతరకర సన్నివేశాలతో సినిమా తీస్తున్నారని ఆమె ఆరోపించింది. అదేవిధంగా హత్యకేసు విచారణ ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఇలాంటి సినిమా వచ్చిందంటే... అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని పిటిషన్‌లో పేర్కొంది అమృత. వెంటనే సినిమా విడుదలను ఆపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్డు.. మర్డర్ మూవీ దర్శక, నిర్మాతలకు కౌంటర్ దాఖలు చేసేందకు గాను ఈ నెల 11 వరకు సమయం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి మర్డర్ మూవీ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ మర్డర్ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సో.. చూడాలి మరి చివరకు ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలవుతుందా? లేక వివాదాల్లో చిక్కుకొని ఆగిపోతుందా? అనేది.


By August 07, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/court-gave-shocking-notice-to-murder-movie-director-and-producers/articleshow/77405280.cms

No comments