Breaking News

ఆప్ఘాన్‌లో ఆత్మహుతి దాడి.. ముగ్గురు మృతి


ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది. ఆ దేశంలోని ఓ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి దాడి అనంతరం జలాలాబాద్ నగరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ భద్రతాదళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ జైలుపై కారు బాంబర్ తో ఆత్మాహుతికి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. నంగర్ హార్ ప్రావిన్సులోని జలాలాబాద్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణనష్టం పెరిగే అవకాశముందని గవర్నర్ ప్రతినిధి అతౌల్లా ఖోగ్యాని చెప్పారు. జైలుపై ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ చెప్పారు.


By August 03, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/suicide-bomber-detonating-a-car-laden-with-explosives-at-afghanistan/articleshow/77325404.cms

No comments