Breaking News

భారత్‌లో కరోనా కలకలం.. 18 లక్షలు దాటిన కేసులు


కలకలం రేపుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. తాజాగా 53 వేలకు చేరువలో నమోదయ్యాయి. దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే 18 లక్షల మార్కును దాటేశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా...771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 2,02,02,858 కరోనా టెస్టుల నిర్వహించగా... గడచిన 24 గంటల్లో 3,81,027 టెస్టులను ఐసీఎంఆర్ నిర్వహించింది. దేశంలో కరోనా పరీక్షలు రెండు కోట్లు దాటాయి. మరోవైపు ఆగస్టు 2 వరకు మొత్తం 2,02,02,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒకే రోజు 3,81,027 నమూనాలను పరీక్షించామని తెలిపింది. Read More: మరోవైపు తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు కొంత మేర తగ్గాయి. కాస్త ఊరట నిచ్చేలా తెలంగాణ ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరింది. ఇందులో 48,609 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,500 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 11 కరోనా మరణాలు సంభవించాయి.


By August 03, 2020 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/corona-cases-in-india-tally-rises-to-1803696-says-ministry-of-health/articleshow/77325947.cms

No comments