Breaking News

పూరీ బీచ్‌లో అయోధ్య సైకత రామాలయం


ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ సందర్భంగా రామనగరం అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. దీపాల వెలుగులతో ఆ నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. భూమి పూజ కోసం అయోధ్య నగరం అంతా సర్వాంగా సుందరంగా సిద్ధమైంది. ఇదే సమయంలో ప్రముఖ సైకత శిల్పి సైతం రాముడిపై అతనికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పూరీ బీచ్‌లో పట్నాయక్ కూడా తన కళాత్మక ప్రదర్శించారు. అయోధ్యలో నిర్మించనున్న రామాలయానికి చెందిన డిజైన్‌ను పూరీ బీచ్‌లో సైకత శిల్పం రూపంలో వేశారు. జైశ్రీరామ్ అన్న నినాదాంతో అద్భుతమైన రంగుల్లో ఆలయ డిజైన్ చేశారు. అంతేకాదు రాముడ్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్ విమానంలో లక్నోకు బయలుదేరారు. ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకమైన వస్త్రాలు ధరించారు. పట్టుపంచె, పొడగు కుర్తా ధరించిన మోడీ మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు. సంప్రదాయబద్ధ వస్త్రధారణలో మోడీ లక్నో నుంచి హెలికాప్టరులో బయలుదేరి అయోధ్యలోని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రామాలయం భూమి పూజా స్థలానికి చేరుకుంటారు. Read More: భూమి పూజ సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు వేదికను పంచుకోనున్నారు. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి కేంద్ర బిందువైన 2.77 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ గతేడాది నవంబరు 9న ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి వేరేచోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు సూచించింది. మందిరం నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటుచేయాలని ఆదేశించింది.


By August 05, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sudarsan-pattnaik-sand-art-on-ayodhya-ram-temple/articleshow/77365528.cms

No comments