బాపట్ల: మతాంతర వివాహం చేస్తుకున్న కూతురు.. తండ్రి ఆత్మహత్య
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమ ఇష్టానికి వ్యతిరేకంగా మతాంతర వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జిల్లా బాపట్లలో జరిగింది. పట్టణంలోని భీమావారిపాలేనికి చెందిన కంచి వెంకట మస్తాన్రావు(48) పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు మరో మతానికి చెందిన యువకుడికి కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామని పెద్దలను కోరగా అంగీకరించలేదు. Also Read: దీంతో యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రియుడిని మతాంతర వివాహం చేసుకుంది. అప్పటి నుంచి మస్తాన్రావు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By August 06, 2020 at 07:14AM
No comments