అనంతపురం: పొలంలో వివాహిత దారుణహత్య.. భర్తపైనే అనుమానాలు
జిల్లాలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. మండలంలోని బసినేపల్లి శివారులో తన వేరుసెనగ పొలంలో కలుపు తీస్తుండగా గుర్తు తెలియని వ్యకి వచ్చి హత్య చేశాడని స్థానిక రైతులు తెలిపారు. గుంతకల్లులోని పాతగుంతకల్లుకు చెందిన నందిని(28)కి బసినేపల్లికి చెందిన నాగార్జునతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. బుధవారం ఉదయం దంపతులు తమ వేరుసెనగ పంటలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసిన తర్వాత నాగార్జున పని మీద ఇంటికి వెళ్లాడు. అతడు ఇంటికి వచ్చిన అరగంటకే నందిని హత్యకు గురైంది. Also Read: గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో ఆమె తలపై నరకడంతో నందిని అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దాడి సమయంలో ఆమె కేకలు విన్న పరిసర ప్రాంతాల్లోని రైతులు పరుగున అక్కడికి రాగా అప్పటికే దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నందినిని ఎవరు? ఎందుకు? చంపారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మెడలోని బంగారం కోసం దుండగుడు హత్య చేసి ఉండవచ్చునని భర్త అనుమానిస్తుండగా, భర్తే తమ కూతురిని హత్య చేశాడని నందిని తల్లిదండ్రులు ఆరోపించారు. Also Read: అనంతపురం నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు నాగార్జున చుట్టూనే తిరగడంతో అతడిపై మరింత అనుమానం పెరిగింది. నందిని బంధువులు పోలీసులు ఎదుటే అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు నాగార్జునను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ కేసును పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By August 06, 2020 at 06:58AM
No comments