Breaking News

భర్త చిత్రహింసలు భరించలేక.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం


భర్త పెట్టే బాధలు భరించలేక ఓ వివాహిత ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్‌లో బుధవారం సాయంత్రం జరిగింది. అయితే లేక్ పోలీసులు సకాలంలో స్పందించడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. నగరంలోని దుర్గమ్మగడ్డకు చెందిన మహిళ(33) భర్త ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా పొలీసు శాఖలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. వారికి ముగ్గురు సంతానం. అయితే కొంతకాలంగా భర్త తీవ్రంగా వేధిస్తుండటంతో ఆమె మనోవేదనకు గురైంది. Also Read: ఇలా రోజూ నరకం అనుభవించడం కంటే చావే మేలనుకుని ఆత్మహత్యకు సిద్ధమైంది. తాను చనిపోతే పిల్లలను గతి ఏమవుతుందోనని ఆలోచించి వారిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోవాలనుకుంది. దీంతో బుధవారం సాయంత్రం పిల్లలతో కలిసి చెరువులోకి దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది ఆమెను గమనించి కాపాడారు. లేక్‌ ఎస్ఐ శ్రీనాథ్‌ ఆమెకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అనంతరం ఆమెను వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆమెకు మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. Also Read:


By August 13, 2020 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karimnagar-married-woman-try-to-jump-in-pond-with-3-childrens-over-husband-harassment/articleshow/77515833.cms

No comments